పవన్‌ కళ్యాణ్‌ను టార్గేట్‌ చేసిన కవిత


            మెదక్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున జగ్గారెడ్డి బరిలోకి దిగుతుండటంతో 
విపక్షాలు, ముఖ్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మింగుడు పడటంలేదు. జనసేన పార్టీ 
అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ కావాలని  జగ్గారెడ్డిని భాజపా అభ్యర్దిగా అఖరి నిమిషములో నిలబెట్టారని 
తెరాస ఎంపీ కవిత అంటున్నారు.  
             
             ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  ఎంత కర్చుచేసి బీజేపీ 
టిక్కెట్ కొనుకున్నాడో వెల్లడించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. 
  టీడీపీ, బీజేపీల గెలువడం కలేఅని ఆమె అభివర్ణించారు. ఇప్పటికే ఆ రెండు పార్టీలను ప్రజలు 
తీర్వంగా వెతిరేక్కిస్తున్నారని ఆమె ఆరోపించారు.  తమ ప్రభుత్వ విధానాలే   మెదక్ ఉప ఎన్నికల్లో 
తమ పార్టీని గెలిపిస్తాయని చెప్పారు.
           
         పవన్ కళ్యాణ్  జగ్గారెడ్డి తరఫున ప్రచారం చేయడానికి మెదక్ వస్తే రాళ్ల దాడి చేస్తామని 
ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌ను ఇప్పటికే తెలంగాణ ప్రజలు  
వెతిరేక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మెదక్ ఉప ఎన్నికల ప్రచారానికి వస్తే వినేవారు ఎవరూ లేరన్నారు.

0 comments: